మన కామారెడ్డి: తెలంగాణా ప్రభుత్వం క్రొత్తగా రూపొందించిన ఐ-పాస్ కారణంగా నిజామాబాదు జిల్లా లో కొత్తగా అనేక పరిశ్రమలు రానున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, భిక్కనూరు మండలాల్లో పరిశ్రమలు స్థాపించటానికి అనేక అప్లికేషన్స్ వచ్చాయని జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఇదివరకే భిక్కనూరు మండలంలో పరిశ్రమలు స్థాపించటానికి అనేక అప్లికేషన్స్ వచ్చాయి, కాని కొన్ని అనివార్య కారణాల వల్ల ముందుకు కొనసాగలేదు. కాని ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఐ-పాస్ కారణంగా వివిధ పరిశ్రమలు క్యూ కట్టాయి. రానున్న కాలంలో మన కామారెడ్డి డివిజన్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందనటంలో ఏమాత్రం సందేహం లేదు.